Duplicate Police: చిత్తూరు జిల్లాలో డూప్లికేట్ పోలీస్ ముఠా

Duplicate Police: తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు * పరారీలో ప్రధాన నిందితులు

Update: 2021-07-15 08:47 GMT

Representational Image

Duplicate Police: చిత్తూరు జిల్లాలో ఓ డూప్లికేట్ పోలీస్ ముఠా ఆట కట్టించారు పోలీసులు. పోలీసులుగా చెలామణీ అవుతూ డబ్బులు కాజేస్తున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తిని బెదిరించి అతని దగ్గర 45 లక్షలు కాజేశారు. ఇదే తరహాలో దక్షిణ భారతదేశంలో పలు చోట్ల మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు పోలీసులు. ముఠాలో తొమ్మిది మందిని అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు షేక్ అబ్దుల్లా పరారీలో ఉన్నట్లు తెలిపారు. 

Tags:    

Similar News