Coronavirus Updates in AP: ఏపీలో కొత్తగా 7,855 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates In AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,855 కరోనా కేసులు నమోదయ్యాయి..

Update: 2020-09-24 13:25 GMT

Coronavirus Updates In AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు తాజాగా గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,855 కరోనా కేసులు నమోదయ్యాయి.. తాజాకేసులతో కలిపి రాష్ట్రములో కరోనా కరోనా కేసుల సంఖ్య 6,54,385కు చేరుకుంది. ఇందులో 69,353 యాక్టివ్ కేసులో ఉండగా 5,79,474 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. తాజాగా మరో 52 మంది కరోనాతో పోరాడి మృతి చెందారు.. దీనితో మృతి చెందిన వారి సంఖ్య 5,506కి చేరుకుంది.. ఇక గడచిన 24 గంటల్లో 76,000 టెస్టుల చేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 53,78,367 కి చేరుకుంది.. 8,807 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఇక తాజా కేసులలో అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 1095 కేసులు నమోదు అయ్యాయి. అనంతపురం లో 497, చిత్తూరులో 902, గుంటూరులో 551, కడపలో 545, కృష్ణా జిల్లాలో 346, కర్నూలు జిల్లాలో మరో 325, నెల్లూరులో 405, ప్రకాశంలో 927, శ్రీకాకుళంలో 461, విశాఖపట్నంలో 425, విజయనగరంలో 384, పచ్చిమ గోదావరి లో 992 కేసులు నమోదయ్యాయి.. ఇక చిత్తూరు 08, అనంతపురం 06, గుంటూరు 06, కృష్ణా 05, విశాఖపట్నం 05, ప్రకాశం 05, తూర్పుగోదావరి 04, కడప జిల్లాలో 03, కర్నూలు జిల్లాలో 03, పశ్చిమగోదావరి 02, నెల్లూరు 02, విజయనగరం 02, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరు మరణించారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 91,142, కర్నూల్ జిల్లా 55,045, అనంతపురం జిల్లా 54,760, పచ్చిమ గోదావరి జిల్లా 61,651, చిత్తూర్ జిల్లా 57,555, విశాఖపట్నం జిల్లా 48,249, గుంటూరు జిల్లాలో 51,789, నెల్లూరు లో 49,568, కడప 41,484, ప్రకాశం జిల్లాలో 44,637, శ్రీకాకుళం 37,354, విజయనగరం 32,981, కృష్ణా జిల్లాలో 25,281 కేసులు నమోదయ్యాయి.




 


Tags:    

Similar News