ఏపీలో ఒక్కరోజే 26 కేసులు నమోదు.. ఒక్క కర్నూల్ లోనే

Update: 2020-04-05 14:37 GMT
Representational Image

కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయినప్పటకి దేశంలో కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గడం లేదు.. ఇక ఏపీలో కూడా కరోనా కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ రోజు 26 కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252 కు చేరింది.

ఇవ్వాళ ఉదయం 10 గంటల నుంచి సాయింత్రం 5 వరకు చేసిన కరోనా కేసులలో ఒక్క కర్నూల్ జిల్లాలోనే 26 కేసులు నమోదు అయ్యాయి. దీనితో కర్నూల్ జిల్లాలో 53కు చేరింది. ఇక నెల్లూరు జిల్లాలో 34 కేసులు నమోదు కాగా, గుంటూరులో 30 కేసులు నమోదు అయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా 3374 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 79 మంది మృతి చెందారు.




 



Tags:    

Similar News