Corona: చిత్తూరు జిల్లాల్లో కరోనా ఉధృతి.. భయాందోళనలో టీటీడీ ఉద్యోగులు

Corona: భయాందోళనలో టీటీడీ ఉద్యోగులు * ఉద్యోగుల రక్షణకు టీటీడీ చర్యలు చేపట్టాలని విన్నపం

Update: 2021-04-29 10:49 GMT

టీటీడీ ఎంప్లాయిస్ (ఫైల్ ఇమేజ్)

Corona: చిత్తూరు జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో భయాందోళనకు గురవుతున్నారు టీటీడీ ఉద్యోగులు. తిరుమల శ్రీవారి దర్శనానికి దేశంలోని నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారని, వీరికి సేవలందించే ఉద్యోగులు కరోనా బారిన పడకుండా.. టీటీడీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. రోటేషన్‌ పద్ధతిలో విధులు నిర్వర్తించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు టీటీడీ ఉద్యోగులు. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు కరోనా బారిన పడి మృతి చెందడం జరిగిందని, ప్రభుత్వంతో పాటు టీటీడీ ఉద్యోగులకు అండగా ఉండాలని కోరుతున్నారు ఉద్యోగులు.

Tags:    

Similar News