వైసీపీలో చేరిన కాంగ్రెస్ నేత డాక్టర్ ఏలూరి..

Update: 2019-03-16 13:57 GMT

కాంగ్రెస్ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి శనివారం వైసీపీలో చేరారు. ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో కలిసి లోటస్ పాండ్ లో జగన్ ను కలిసిన ఆయన.. ఆ పార్టీలో చేరారు. ఏలూరికి వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు జగన్. ఈ సందర్బంగా ఏలూరి మాట్లాడుతూ.. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ ను సిఎంగా చూడాలని కోరుకుంటున్నారని, వైఎస్ ఆశయ సాధన కోసం శక్తి వంచన లేకుండా పార్టీకి కృషి చేస్తానని ఏలూరి తెలిపారు.

Similar News