పోసానికి పృథ్వీ సవాల్.. దమ్ముంటే..

Update: 2020-01-11 07:19 GMT
పోసానికి పృథ్వీ సవాల్

పోసాని కృష్ణమురళి తనపై చేసిన వ్యాఖ్యలపై ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీ మండిపడ్డారు. తాను వ్యవసాయం చేసే రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులు అనలేదని చెప్పారు. అమరావతిలో ధర్నాలు చేస్తున్న వారిలో పెయిడ్‌ ఆర్టిస్టులు ఉన్నారని పృథ్వీ తెలిపారు. పెయిడ్‌ ఆర్టిస్టుల సంస్కృతి తెచ్చిందే టీడీపీనే అని ఆరోపించారు. ఎవరో మాట్లాడితే తాను సమాధానం చెప్పాల్సిన అవసరంలేదని పృథ్వీ చెప్పారు.

అమరావతి రైతుల నుంచి భూములు లాక్కున్నప్పుడు పోసాని కృష్ణమురళి ఎందుకు స్పందించలేదన్నారు పృథ్వీ. పోసానికి దమ్ముంటే ఓ వేదికపైకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. పోసాని ఎందుకలా మాట్లాడుతున్నారో అందరికీ తెలుసన్నారు పృథ్వీరాజ్. తానెప్పుడూ రైతులను కించపరచలేదని, ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అమరావతి పోరాటంలో బినామీ రైతులు ఉన్నారన్నారు పృథ్వీ.


Full View

 

Tags:    

Similar News