ఈ నెల 19న మరోసారి ఢిల్లీకి సీఎం జగన్

Update: 2019-06-17 08:27 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్ది ఈ నెల 19న మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని ఆహ్వానం మేరకు అఖిలపక్ష సమావేశంలో జగన్ పాల్గొనున్నారు. ఈ సమావేశంలో జమిలి ఎన్నికలపై చర్చ జరగనుంది. ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం 20న పోలవరం ప్రాజెక్టు పరిశీలించేందుకు జగన్ వెళ్లనున్నారు. పోలవరం పనుల పురోగతిని జగన్ పరిశీలించనున్నారు. తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జగన్ పోలవరానికి వెళ్తున్నారు. కాగా లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల అధినేతలను మోడీ ఆల్ పార్టీ మీటింగ్‌కు ఆహ్వానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబుకి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్లహ్లాద్ జోషి ఇప్పటికే లేఖ పంపిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News