నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌

ఏపీ ముఖ‌్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకానున్నారు.

Update: 2019-08-26 01:36 GMT

 ఏపీ ముఖ‌్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకానున్నారు. రాష్ట్రాల్లో నక్సలిజం సమస్యపై తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సారథ్యంలో ఈ సమావేశం జరగనుంది. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గోనున్నారు. ఏపీలో ఏవోబీతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్న నక్సలిజం సమస్య చర్చకు రానుంది. మంగళవారం ఉదయం బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరిగి విజయవాడ చేరుకుంటారు.  

Tags:    

Similar News