మోడీకి పాదాభివందనం చేయబోయిన ఏపీ సీఎం జగన్

Update: 2019-06-09 16:00 GMT



ప్రధాని మోడీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. తిరుమల వెంకన్న దర్శనం, తిరుపతిలో బహిరంగ సభ కార్యక్రమాల కోసం కొలంబో నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రేణిగుంట విమానాశ్రయంలో ప్రధానికి గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు, వైసీపీ నేతలూ స్వాగతం పలికారు. గవర్నర్ మోడీకి ఓ పువ్వు ఇచ్చి స్వాగతం పలికారు. తరువాత ముఖ్యమంత్రి జగన్ కూడా ఒక పువ్వు మోడీకి అందచేశారు. ఈ సందర్భంగా మోడీ కాళ్ళకు నమస్కారం చేయడానికి జగన్ ప్రయత్నించారు. అయితే, ప్రధాని మోడీ వద్దని వారించారు. అటు తర్వాత ముఖ్యమంత్రి ప్రధానికి స్వాగతం చెప్పడానికి వచ్చిన వైసీపీ నేతలను ఆయనకు పరిచయం చేశారు. 

Tags:    

Similar News