CM Jagan: నేడు చిత్తూరు జిల్లా పర్యటనకు సీఎం జగన్‌.. 300 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన

CM Jagan: ఉ.10.30కి అమూల్‌ సంస్థ యూనిట్‌కు భూమిపూజ కార్యక్రమం

Update: 2023-07-04 03:56 GMT

CM Jagan: నేడు చిత్తూరు జిల్లా పర్యటనకు సీఎం జగన్‌.. 300 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన

CM Jagan: సీఎం జగన్‌ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు చిత్తూరు చేరుకుంటారు. చిత్తూరు విజయ డెయిరీ వద్ద అమూల్‌ సంస్ధ ఏర్పాటు చేసే నూతన యూనిట్‌కు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పోలీస్‌ పరేడ్‌ మైదానంలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాల ఆవరణలో 300 పడకల ఆస్పత్రికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Tags:    

Similar News