మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్‌

Update: 2019-08-09 15:11 GMT

మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్‌. పంచాయతీరాజ్‌ శాఖలో ఇంజినీరింగ్‌ పనుల నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 586 కోట్ల విలువైన ఇంజినీరింగ్‌ పనులను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 144 పనులు నిలిపివేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటికి ముందు అనుమతి పొంది ఇప్పటికీ ప్రారంభంకాని పనుల నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రారంభమై, 25 శాతానికి మించని వాటిపై రివ్యూ చేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విజయనగరం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లో ఇంజినీరింగ్‌ పనులు నిలిపివేయనున్నారు.

Full View

Tags:    

Similar News