చిన్నారి లేఖకు స్పందించిన జగన్ ...

Update: 2019-09-14 10:06 GMT

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా రామచంద్రపురం గ్రామంలో తమ కుటుంబాన్ని గ్రామపెద్దలు వెలివేయడంతో కోడూరి పుష్ప అనే అమ్మాయి ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ కథనాలు పలు దినపత్రికల్లో సైతం ప్రచురితమయ్యాయి. తనతో స్కూలులో కూడా ఎవరూ మాట్లాడటం లేదనీ, ఒకవేళ ఎవరైనా మాట్లాడితే రూ.10,000 జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారని చిన్నారి సీఎంకు విన్నవించుకుంది.

తమకు అండగా నిలవాలని నాలుగో తరగతి చదువుతున్న ఈ చిన్నారి ముఖ్యమంత్రిని కోరింది. ఈ విషయం ఎట్టకేలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వెళ్లింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ తో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు. వెంటనే బాలిక వివరాలు కనుక్కోవాలనీ, సమస్యను పరిష్కరించాలని జగన్ ఆదేశించారు.

   

Also read  CM జగన్‌కు ప్రకాశం జిల్లాకు చెందిన నాలుగో తరగతి చిన్నారి లేఖ

Tags:    

Similar News