వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు..

Update: 2019-02-24 01:18 GMT

గుంటూరులో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. జనసేన నేతలు గుంటూరులో పర్యటించారు. ఈ సందర్బంగా కొందరు జనసైనికులు, వైసీపీ కార్యకర్తలకు మాటామాటా పెరిగింది. దీంతో ఇరుపార్టీల కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో కొద్దిసేపటికే పరిష్టితి అదుపులోకి వచ్చింది.  

Similar News