విజయవాడలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన

కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ దంపతులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేదపండితులు

Update: 2021-12-25 04:56 GMT

విజయవాడలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన

NV Ramana: విజయవాడ ఇంద్రకీలాద్రీపై కనకదుర్గమ్మను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎన్వీ రమణ దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీజేఐ రాక సందర్భంగా అధికారులు, పోలీసు యంత్రాంగం గట్టి భద్రత ఏర్పాట్లను చేసింది. సీజేఐ ఇవాళ, రేపు విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Tags:    

Similar News