Chandrababu Naidu: న్యూ ఇయర్ వేడుకలకు టీడీపీ దూరం.. చంద్రబాబు ట్వీట్

Update: 2019-12-31 05:22 GMT

టీడీపీ నేతలు ఎవరూ కూడా నూతన సంవత్సర వేడుకలలో పాల్గొనవద్దని, వేడుకలను దూరంగా ఉండాలని చంద్రబాబు పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఖర్చు చేసే డబ్బును జేఏసీలకు, అమరావతి పరిరక్షణ సమితికి విరాళంగా ఇవ్వాలని తెలిపారు. ఎవరూ కూడా బొకేల కోసం, కేకుల కోసం ఖర్చు చేయవద్దని, తన వద్దకు తీసుకురావొద్దని ఆయన కోరారు.

అమరావతి రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారన్నారని తెలిపారు. కష్టించి పంటలు పండించే రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందని ‍ఆయన తెలిపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, అందరూ తనకు సహకరించాలని చంద్రబాబు చెబుతున్నారు. నూతన సంవత్సరం రోజులన ఆయా గ్రామాల్లో పర్యటించి రైతులు, కూలీలకు అండగా ఉండాలన్నారు. ఇదే నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల్లో మరోసారి పర్యటించనున్నారు. మందడం, ఎర్రబాలెం, కృష్ణాయపాలెంలో టీడీపీ అధినేత పర్యటిస్తారు.




Tags:    

Similar News