అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు: చంద్రబాబు

Update: 2019-07-18 04:48 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న తీరును ప్రతిపక్షనేత నారా చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఏపీ మంత్రిమండలి సమావేశం కోసం అసెంబ్లీని వాయిదా వేయడం ఏంటని నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అసలు అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని అన్నారు. కాగా మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని స్పీకర్ ను కోరారు చంద్రబాబు. అయితే అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే సభలో గందరగో పరిస్థితి ఎర్పడింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం నడిచింది. వెంటనే సభను స్పీకర్ ఆర్డర్‌లో పెట్టారు. సభలో చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎలా వ్యవహరిస్తున్నారంటే. తన విద్యుత్ కంపెనీలు యూనిట్ రూ.5కు అమ్ముకోవాలి... మిగిలిన కంపెనీలు నాశనం కావాలన్న పెడ ధోరణితో వ్యవహారిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

Tags:    

Similar News