సీఎం జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. అధికారం ఉందన్న అహంకారంతో టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ది దుర్మార్గ పాలన అని ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే పరిస్థితి టీడీపీకి లేదన్నారు. జగన్ ప్రవేశపెడుతున్న పథకాలు కొందరికే వర్తిస్తున్నామని ఆరోపించారు. ఇంగ్లిష్ మీడియం, ఇసుక కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.