ప్రతికూల వాతావరణం నేపథ్యంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాన్ని దారి మళ్లించారు. రాత్రి 7.20కి విజయవాడ నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఎయిరిండియా విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. దీంతో రాత్రి 9.20కి చంద్రబాబు ప్రయాణిస్తున్న విమానం బెంగళూరు చేరుకుంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో కాసేపట్లో ఆ విమానం హైదరాబాద్కు బయల్దేరనుంది. చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేశ్ కూడా విమానంలో ఉన్నారు.