నేడు కడపకు హోంమంత్రి రాజ్‌నాథ్‌

Update: 2019-01-18 03:08 GMT

నేడు (శుక్రవారం) వైయస్ఆర్ కడప జిల్లాలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2.50 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 3.30 గంటలకు నగరంలోని ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న కందుల కుటుంబీకుల మైదానానికి చేరుకుంటారు. అక్కడ రాయలసీమ పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తరువాత 4.55 గంటలకు కడప విమానాశ్రయం నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. కాగా ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి పాల్గొననున్నారు. 

Similar News