కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక టీడీపీకి షాకిచ్చేలా ఉన్నారు. ఆమె తిరిగి సొంతగూటికి చేరుకునేలా పరిస్థితి కనిపిస్తోంది. రెండు రోజులుగా టీడీపీకి ఆమె గుడ్ బై చెప్పబోతుందనే ప్రచారం జరుగుతోంది. శనివారం ఇడుపులపాయలో వైసీపీ అధినేత జగన్ను రేణుక కలిసే అవకాశముంది. రేణుక వైసీపీలో చేరుతారన్న వార్తల నేపథ్యంలో టీడీపీ అప్రమత్తమైంది. స్వయంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మంత్రి కెఇ కృష్ణమూర్తి రంగంలోకి దిగి బుజ్జగిస్తున్నట్టు సమాచారం.
మరోవైపు వైసీపీలో రేణుకకు టిక్కెట్ హామీ ఇవ్వకున్నా ఆ పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. కాగా వైసీపీలో చేరికపై కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు. వారి సూచనలతో ఆమె టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.