NTR District: హాస్టల్‌లో విద్యార్ధిని ఆత్మహత్య.. ఆందోళనకు దిగిన విద్యార్థిని తల్లిదండ్రులు

NTR District: కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Update: 2024-01-27 14:15 GMT

NTR District: హాస్టల్‌లో విద్యార్ధిని ఆత్మహత్య.. ఆందోళనకు దిగిన విద్యార్థిని తల్లిదండ్రులు

NTR District: ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలోని లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంజనీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్న రోషిణి అనే విద్యార్థిని హాస్టల్‌ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కళాశాల వద్ద విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. రోషిణి మృతికి కారణమైన వారిని కఠిన శిక్షించాలని యువతి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News