బిస్కెట్లు ఎత్తుకెళ్లిన కోతి వెంటపడి చివరకు...

Update: 2019-07-26 04:48 GMT

తన దూకాణంలో బిక్కెట్ ప్యాకెట్లు ఎత్తుకెళ్లిన కోతిని తరమి బిస్కెట్ల ప్యాకెట్లు వెనక్కి తిసుకొద్దాం అనుకున్నాడు. కానీ అనుకోకుండా అక్కడే ఉన్న కరెంట్ తీగలు తగిలి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ముదిగుబ్బలో గురువారం చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే ముదిగుబ్బలోని పెద్దమ్మ ఆలయం వద్ద రాజు(25) చిరువ్యాపారం చేస్తుంటాడు. అయితే గురువారం రాజు దుకాణంలోకి ప్రవేశించిన ఓ కోతి బిస్కెట్‌ ప్యాకెట్లు ఎత్తుకెళ్లి సమీపంలోని రేకులషెడ్డు పైకి చేరుకుంది. వెంటనే రాజు దాన్ని అదిలించేందుకు ఆ షెడ్డుపైకి ఎక్కాడు ఈ క్రమంలోనే అక్కడే ఉన్న 11కేవీ విద్యుత్తు తీగలు తగలడంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కుమారుడి మృతదేహాన్ని చూసిన రాజు తల్లిదండ్రులు నాగలక్ష్మి, గంగన్న కన్నీరుమున్నీరయ్యారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News