కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ట్రక్ టర్మినల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సౌత్ ఇండియా లారీ ట్రాన్స్పోర్ట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో12 లారీలు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు కేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.