AP BJP: రేపు బీజేపీ పదాధికారుల సమావేశం

AP BJP: ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన భేటీ

Update: 2024-03-25 11:28 GMT

AP BJP: రేపు బీజేపీ పదాధికారుల సమావేశం

AP BJP: ఏపీలో బీజేపీలో దూకుడు పెంచింది. పొత్తులో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎన్నికలకు వ్యూహ రచన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షత కీలక నేతలు భేటీ కానున్నారు. ఈ కార్యక్రమానికి సిద్ధార్థ్‌నాథ‌ సింగ్ హాజరై ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు దిశానిర్ధేశం చేయనున్నారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా నియోజకవర్గాల వారిగా కమిటీలు వేసి.. నాయకులకు బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News