ప్రస్తుతం దేశంలో బీజేపీ మాత్రమే అభివృద్ధి కోరుకుంటోంది:కృష్ణంరాజు

Update: 2019-07-07 13:10 GMT

ప్రస్తుతం దేశానికి దశా..దిశా బీజేపీ మాత్రమే అని బీజేపీ నాయకుడు కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. విజయవాడలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నా అభిమానులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారన్న అయన నేను ఎప్పుడూ బీజేపీలో చేరమని వారికి సూచిన్చాలేదన్నారు. అయితే, ప్రపంచంలో అభివృద్ధిలో 11వ స్థానంలో ఉన్న మన దేశం మోడి పాలన వల్ల 5వ స్థానానికి చేరుకుందదనీ, త్వరలో 3వ స్థానానికి చేరుకున్తుందనీ ఆయన చెప్పారు. అందుకే, రాజకీయాలలోకి రావాలనుకుంటున్న నా అభిమానులకు బీజేపీ లో చేరమని ఇప్పుడు చెబుతున్నానన్నారు. వారసత్వం కాకుండా, ప్రతిభ, ప్రజా క్షేమం కోరే వారే బీజేపీ లో నాయకులు గా ఎదుగుతారనీ, కిషన్ రెడ్డి ఎదిగిన వైనమే ఇందుకు నిదర్శనం అనీ అయన చెప్పారు. 

Tags:    

Similar News