TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

* రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను చర్చించి పరిష్కరించుకుంటాం- సోమేష్ కుమార్

Update: 2021-11-15 08:27 GMT

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు(ట్విట్టర్ ఫోటో)

TTD: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో కర్ణాటక సీఎం, పుదుచ్చేరి హోంమంత్రి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనంతరం రంగనాయకుల మండపంలో ప్రముఖులకు పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను చర్చించి పరిష్కరించుకుంటామన్నారు సోమేష్ కుమార్.

Tags:    

Similar News