ఆ జీవోను విడుదల చేయాలి లేకపోతే కోర్టుకు వెళ్తా : అశోక్ గజపతి రాజు

Update: 2020-03-07 05:54 GMT
ఆ జీవోను విడుదల చేయాలి లేకపోతే కోర్టుకు వెళ్తా : అశోక్ గజపతి రాజు

దాతల భూములు ఆలయాలకే చెందాలన్నారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు. ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదన్నారు. మాన్సాస్ ట్రస్ట్ వివాదంపై అశోక్ గజపతి రాజు స్పందించారు. ట్రస్టు, దేవాలయ భూములపై కన్నేశారని ఈ విషయంలో రాజకీయ జోక్యం తగదన్నారు. అసలు జీవో ఎందుకు రహస్యంగా ఉంచారని ప్రశ్నించారు. జీవోను విడుదల చేయాలి లేకపోతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు అశోక్ గజపతి రాజు. రాజధాని తరలింపు వ్యవహారంతో తాము కూడా బాధితులుగా మారామంటూ ఆవేదన వ్యక్తం చేశారు అశోక్ గజపతి రాజు.


Full View

 

Tags:    

Similar News