ఏపీలో మాజీలైన ముగ్గురు ఎమ్మెల్యేలు

Update: 2019-02-01 13:37 GMT

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి జనసేనలో చేరిన రావెల కిశోర్‌బాబు, టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన మేడా మల్లిఖార్జునరెడ్డి, బీజేపీ నుంచి జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణ రాజీనామాలకు స్పీకర్ ఆమోదముద్ర వేశారు. పార్టీ మారే సమయంలోనే ఈ ముగ్గురు తమ ఎమ్మెల్యే పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు.

దీంతో స్పీకర్ తన నిర్ణయం తీసుకున్నారు. కాగా గతేడాది మాజీ మంత్రి, రావెల కిషోర్‌బాబు కూడ ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా గతనెల 21న జనసేన కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండిగెలుపొందిన మేడా మల్లిఖార్జున్ రెడ్డి.. జనవరి 31న వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. 

Similar News