పోలవరం ప్రాజెక్టు ఖర్చులు చెల్లించండి

Update: 2019-06-13 13:00 GMT

పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రం ఖర్చుపెట్టిన మొత్తాన్ని కేంద్రం నుంచి రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను అయన ఆదేశించారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేసిన నిధులను వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ఆర్ధిక శాఖ అనుమతి కోసం దస్త్రాన్ని పంపారు. కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి ఆమోదం తర్వాత నిధులు విడుదలయ్యే ఆవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పోలవరం నిర్మాణం పూర్తిగా కేంద్రానిదే.. అయినా రాష్ట్రం ఖర్చు చేస్తోంది. ఇప్పటికే 5 వేల కోట్లు ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. 

Tags:    

Similar News