చంద్రబాబులా మాటలు చెప్పని, చేతల్లో చూపించే సీఎం జగన్ అని తెలిపారు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పంచాయితీలు బాగుంటే గ్రామాలు బాగుంటాయని సీఎం గ్రామ వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నారని అన్నా,రు. 2వేల జనాభాకు గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం 14వేల 9 వందల మంది ఉద్యోగుల నియామకం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా జరుగుతుందన్నారు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేష్ ఇస్తామని తెలిపారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.