ఏపీలో విత్తన కోరత పాపం టీడీపీదే: కన్నబాబు

Update: 2019-07-07 10:03 GMT

ఏపీలో విత్తన కొరతకు గత టీడీపీ ప్రభుత్వమే కారణమంటున్నారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. రైతుల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. రైతుల కోసం విత్తనాలు కొనుగోలు చేయాలంటూ వ్యవసాయ శాఖ అధికారులు ఎన్ని లేఖలు రాసినా అప్పటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన ప్రతి హామిని తమ అధినేత వైఎస్ జగన్ నెరవేరుస్తారని ఆయన అన్నారు. రైతుల భవిష్యత్‌ను బంగారు మయం చేసేందుకు రైతు దినోత్సవం నిర్వహిస్తున్నట్టు కన్నబాబు తెలియజేశారు. శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాళ్‌కు 15 వందల రూపాయలు అదనంగా చెల్లిస్తున్నట్టు తెలియజేశారు. 

Tags:    

Similar News