ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ అడ్వాన్స్డ్ సఫ్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షకు 4,76,710 మంది హాజరు కాగా.. మార్చిలో జరిగిన పరీక్షల్లో 2,86,932 మంది విద్యార్థులు, సప్లిమెంటరీ పరీక్షల్లో 53,025 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మొత్తంగా 3,39,957 మంది ఉత్తీర్ణత సాధించారు.
అదేవిధంగా ద్వితీయ ఇంటర్ పరీక్షలకు 4,31,739 మంది విద్యార్థులు హాజరవ్వగా.. మార్చిలో జరిగిన పరీక్షల్లో 3,09,721 మంది, సప్లిమెంటరీలో 66,114 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో ద్వితీయ ఇంటర్లో మొత్తంగా 3,75,835 మంది ఉత్తీర్ణులయ్యారు.