ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 47 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సాధారణ పరిపాలనకు పంపిన వారికి కూడా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్, ఇంటర్ బోర్డు కార్యదర్శిగా కాంతిలాల్ దండే, సహకారశాఖ కార్యదర్శిగా వాణిమోహన్, కార్మికశాఖ కమిషనర్గా వరప్రసాద్, బీసీ కార్పొరేషన్ ఎండీ రామారావు, కార్మిక ఉపాధి కల్పన, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా మధుసూదన్రెడ్డిలతోపాటు పలువురు అధికారులను బదిలీ చూస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.