ఏపీ ప్రజలకు సంక్రాంతి గిఫ్ట్ ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. శుక్రవారం నెల్లూరు జిల్లాలో జరిగిన జన్మభూమి – మన ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వృద్ధులు, పేదల ఫించన్లను డబుల్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఏపీలో ఇస్తున్న 1000 రూపాయల పించన్లను.. రెండు వేలకు పెంచుతున్నట్టు చెప్పారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమి సభలో సీఎం ఈ ప్రకటన చేశారు. జనవరి నుంచే పెంచిన పించన్ను చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు న్యూ ఇయర్ కానుకగా ఈ నెల 3వేలు అందిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. పేదలకోసం ఇంకా చాలా చేయాలని ఉందని, కానీ ఖజనా సహకరించడం లేదన్నారు. అలాగే మోడీ, జగన్లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన సీఎం ఇద్దరు కలిసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి జగన్ సీఎం అయితే పెద్దుబడులు రావని ఆయన ఎద్దేవా చేశారు.