ఇక ఏపీలో ఇసుక జాతర

సెప్టెంబర్ 5నుంచి ఏపీలో కొత్త ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. దాంతో ఇసుక పాలసీపై ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇప్పుడున్న దానికంటే తక్కువ ధరకి ఇసుక అందుబాటులోకి తేవాలని అధికారులను జగన్ ఆదేశించారు.

Update: 2019-08-27 10:18 GMT

సెప్టెంబర్ 5నుంచి ఏపీలో కొత్త ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. దాంతో ఇసుక పాలసీపై ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇప్పుడున్న దానికంటే తక్కువ ధరకి ఇసుక అందుబాటులోకి తేవాలని అధికారులను జగన్ ఆదేశించారు. ఇసుక సప్లై పెంచితేనే రేట్లు తగ్గుతాయన్న జగన్‌ ఇప్పట్నుంచే స్టాక్ యార్డుల్లో ఇసుక నింపాలని సూచించారు. అవకాశమున్న ప్రతిచోటా రీచ్‌లను పెంచాలని, అలాగే ఇసుక రవాణాలో ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న సీఎం జగన్‌ ఇసుక సప్లైలో తప్పులు జరగకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.  

Tags:    

Similar News