Andhra Pradesh: కోవిడ్ మృతుల పరిహారం చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

*కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50వేల పరిహారం *రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించేందుకు ఆదేశాలు

Update: 2021-10-26 07:40 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ఫోటో- ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: కోవిడ్ మృతుల పరిహారం చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు 50వేల రూపాయల పరిహారం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి 50 వేల రూపాయలు చెల్లించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి.

కలెక్టరేట్ లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని, మృతుల జాబితా రూపొందించి చెల్లింపులు చేయాలని సూచనలు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్, దరఖాస్తు తీసుకున్న 2 వారాల్లోగా పరిహారం చెల్లింపు పూర్తికి సూచనలు ఇచ్చారు. ఇక ఈ దరఖాస్తు కోసం వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించింది.

Full View
Tags:    

Similar News