జషిత్ తల్లిదండ్రులను పరామర్శించిన పిల్లి సుభాష్ చంద్రబోస్

Update: 2019-07-27 12:15 GMT

మండపేటలో కిడ్నాపర్ల నుంచి సురక్షితంగా విడుదలైన జషిత్ కుటుంబ సభ్యులను ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు జషిత్‌తో ముచ్చటించారు. అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ జషిత్ కిడ్నాప్ ఘటనలో పోలీసులు, మీడియా కృషిని కొనియాడారు. పోలీస్ దర్యాప్తు వేగవంతంగా జరుగుతోందన్నారు. రెండు రోజుల్లో కిడ్నాపర్లను పోలీసులు పట్టుకుంటారని వెల్లడించారు. నిందితులు ఎంతటివారైనా వదిలేది లేదని.. కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. 

Tags:    

Similar News