Teachers Day 2022: సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్

Teachers Day 2022: ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రభుత్వ పురస్కారాల అంద చేసిన సీఎం జగన్

Update: 2022-09-05 06:45 GMT

సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్ 

Teachers Day 2022: తల్లిదండ్రులు జన్మనిస్తే వారికి భవితనిచ్చేది గురువు మాత్రమే అన్నారు ఏపీ సీఎం జగన్. గురుపుజోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు ఉపాధ్యాయులను సీఎం సత్కరించారు. మంచి భోదనతో సమాజాన్ని మార్చే శక్తి గురువులకు మాత్రమే ఉందన్నారు. విద్యారంగాన్ని మెరుగు పరిచేందుకు అనేక గొప్ప కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు.

Tags:    

Similar News