ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం చేపట్టిన స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై జగన్ సమీక్ష చేయనున్నారు. స్పందనపై ప్రతి మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి జగన్ తెలుగురాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్ ఈరోజు విజయవాడకు చేరుకున్నారు.