రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు.

Update: 2019-08-25 04:31 GMT

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. ముఖ్యంగా పోలరవం రివర్స్‌ టెండరింగ్‌ సహా.. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పలు అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా.. జగన్ 15 వ ఆర్థిక సంఘం ఛైర్మెన్‌ ఎంకే సింగ్‌తో కూడా భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రత్యేకంగా చర్చిస్తారు. 

Tags:    

Similar News