ఢిల్లీకి బయలుదేరిన ఏపీ సీఎం జగన్

Update: 2019-06-14 08:31 GMT

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీలో సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను ఆయన కలవనున్నారు. ఏపీ అభివృద్ధి పనుల కోసం జగన్ ఢిల్లీలోనే మూడు రోజులపాటు ఉండనున్నారు. అలాగే, రేపు ప్రధాని నాయకత్వంలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో జగన్‌ పాల్గొంటారు. గతంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని నీతి ఆయోగ్ చెప్పినందుకే తాము ఇవ్వలేకపోతున్నామని కేంద్రం తెలిపింది. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను నీతి ఆయోగ్‌కు వివరించడానికి సీఎం జగన్ ఇప్పటికే ఓ నివేదికను సిద్ధం చేయించారు. భేటీ సందర్భంగా ఆ రిపోర్టును నీతి ఆయోగ్ ముందు దాన్ని ఉంచనున్నారు. మరోవైపు రేపు నిర్వహించే వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ జగన్ పాల్గొంటారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో ఆయన చర్చిస్తారు.  

Tags:    

Similar News