ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ వాయిదా పడింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో ఆయన తన ఢిల్లీ టూర్ను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆయా అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, పోలవరం నిధుల గురించి కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర షెకావత్తో చర్చించాలని సీఎం వైఎస్ జగన్ భావించారు. అయితే, కాసేపట్లో జగన్ ఢిల్లీ బయలుదేరాల్సి ఉండగా చివరి నిమిషంలో సీఎం పర్యటన వాయిదా పడింది.
HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి