పవన్ కల్యాణ్‌ను కలిసిన రాజధాని రైతులు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంత రైతులు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను హైదరాబాద్‌లో కలిశారు.

Update: 2019-08-24 08:05 GMT

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంత రైతులు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను హైదరాబాద్‌లో కలిశారు. తమ సమస్యల పరిష్కారానికి ఆయన మద్దతు కోరారు. రాజధాని తరలింపులాంటి అపోహలపై ఆయనతో మాట్లాడారు. రైతు సమస్యలపై పోరాటాలకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. పవన్‌తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసేందుకు రాజధాని రైతులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజధాని రైతులు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను కలిసిన విషయం తెలిసిందే. రాజధానికి భూములిచ్చిన రైతుల్ని ఆదుకోవాలంటూ కోరారు. 

Tags:    

Similar News