తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట భీమేశ్వరాలయంలో.. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని.. పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన కర్రి వెంకటరాజు.. తన తండ్రి సత్యనారాయణ పేరుపై అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 20 వేలకు పైగా భక్తులు పాల్గొన్నారు. గత 20 ఏళ్లుగా భీమేశ్వర స్వామివారి సేవలో సత్యనారాయణ తరించారని.. ఆయన పరమపదించినా.. కుమారుడు వెంకటరాజు తండ్రి ఆశయాలను లక్ష్యంతో.. అన్నదానం నిర్వహించినట్లు తెలిపారు.