ఏపీ ఎన్నికలు.. భారీగా నగదు పట్టివేత..

Update: 2019-03-19 14:19 GMT

ఏపీలో ఎన్నికల వేళ కోడ్ ఉల్లంఘన యధేచ్చగా జరుగుతోంది. కోడ్ అమల్లోకి వచ్చి రెండు రోజులు అయినప్పటికీ రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. డబ్బు., మద్యం ఏరులై పారుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రూ.16 కోట్ల 53 లక్షల నగదు పట్టుబడినట్టు ఏపీ సీఈవో ద్వివేది వెల్లడించారు. 33కేజీల గంజాయి. దాదాపు 2లక్షలకు పైగా విలువైన 324 చీరల్ని పట్టుకున్నామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 252 FIR‌లు నమోదయ్యాయని ఆయన తెలిపారు. అలాగే 2 కోట్లకు పైగా విలువైన 8 కేజీల బంగారం, 22 కేజీల వెండి.. మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు ద్వివేది. కాగా కోడ్ ఉల్లంఘనకు సంబంధించి టీడీపీకి 48 నోటీసులు., వైసీపీకి 30, జనసేనకు 11 నోటీసులు జారీ చేశారు.

Similar News