చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు!

ఏపీలో గత కొద్దిరోజులుగా టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది.

Update: 2020-05-14 09:14 GMT
chandrababu naidu (file photo)

ఏపీలో గత కొద్దిరోజులుగా టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. 23 సీట్లతో చిత్తుగా ఓడి ఏడాది తిరగకముందే చంద్రబాబు తన పరిపాలనను తానే మెచ్చుకుంటుంటే కొత్తగా సామెత చెప్పాలనిపిస్తోంది అంటూ కోతి మొహం కోతికి ముద్దు అంటూ విమర్శించారు.

అంతేకాకుండా పోతిరెడ్డిపాడు జిఓపై తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి బాబు అను-కుల మీడియా కింద మీదా పడుతోంది. బాబు సిఎంగా లేని రాష్ట్రం ప్రశాంతంగా ఉండొద్దని కుతంత్రాలు పన్నుతోంది. రాజకీయ పార్టీల కంటే ఎల్లో మీడియా ఎజెండానే అత్యంత క్రూరంగా, అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవాలన్నట్టుగా ఉంది...అంటూ విమర్శించారు.

అంతేకాకుండా ఇసుక మాఫియాను సృష్టించి నదులను అడుగంటా ఊడ్చినందుకు గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల పెనాల్టీ విధించింది నీ హయాంలోనే కదా? ప్రకాశం బ్యారేజిలో 15 ఎకరాల కృత్రిమ ద్వీపం ఏర్పాటుకు డ్రెడ్జింగుకు అనుమతిందీ నువ్వే. ఇప్పుడు మడ అడవుల పేరుతో పర్యావరణం ఖూనీ అని దొంగ ఏడుపులేడుస్తున్నావు అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు.

కాలం చెల్లిన ఆలోచనలకు ఎంత పదును పెట్టినా ప్రయోజనం ఉండదు బాబూ. అడ్డంగా దొరికి పోయావు. నేను రెండు రాష్ట్రాలు తిరుగుతున్నానని టి.డిజిపికి కంప్లెయింట్ ఇప్పించావు. మరి వైజాగ్ వెళ్లడానికి డిజిపిలను అడగకుండా కేంద్రం అనుమతి ఎందుకు కోరావు? నీ డ్రామాలు తెలియనంత అమాయకులెవరూ లేరని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.




 



Tags:    

Similar News