ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభకు ఎన్నికైన 25 మంది ఎంపీలు సోమవారం 17వ లోక్ సభ సమావేశాల్లో ఏపీ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ప్రమాణం చేయించారు. ఆంగ్ల అక్షర క్రమంలో మొదటగా అండమాన్ నికోబార్ ఎంపీలు, తర్వాత ఏపీ ఎంపీలు ప్రమాణం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ సంఖ్య ఆధారంగా వరుసగా ఎంపీల ప్రమాణాల జరిగాయి. తెలుగులో 12 మంది, ఇంగ్లీష్లో 11 మంది, హిందీలో ఇద్దరు దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. అరకు ఎంపీ మాధవి తొలుత ప్రమాణం స్వీకారం చేయగా ఏపీ నుంచి చివరగా చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ప్రమాణం చేశారు. టీడీపీ తరపున ఎన్నికైన ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు ఇంగ్లీష్, ఒకరు హిందీలో ప్రమాణం చేశారు.