చంద్రబాబు సలహాలు అమెరికా అధ్యక్షుడికి అవసరమేమో
టీడీపీ అధినేత , ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు ఎక్కుపెట్టారు.
టీడీపీ అధినేత , ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో కరోనా ఉదృతి పెరిగిపోతుంటే, గెలిపించిన ప్రజలను వదలి చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారని విమర్శించారు. హైదరాబాద్ లో ఉండి ఆంధ్ర నుంచి ఆమెరికా వరకు ఆయన సలహాలు ఇవ్వడం చాలా దురదృష్టకరమని విమర్శించారు. చంద్రబాబు సలహాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అవసరమేమో గానీ, సీఎం జగన్ కు అవసరం లేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఆదర్శవంతమైన పాలన కొనసాగిస్తున్నారని ప్రశంసించారు.
ఏపీ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ అన్ని విధాల అభినందనీయం అని కొనియాడారు. విదేశీయులను, ఢిల్లీ వెళ్లొచ్చిన వారిని గుర్తించడంలో వాలంటీర్లు సమర్థవంతంగా పనిచేశారని కితాబిచ్చారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ఏడు టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కరోనా వ్యాధీని ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అంతే కాకుండా 12వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాలయ వరకు ప్రభుత్వమే భరిస్తుందని రోజా అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రోజా ధన్యవాదాలు తెలిపారు.