కాసేపట్లో కరోనాపై సీఎం జగన్ సమీక్ష
కరోనా వ్యాప్తి నిరోధానికి ఏపీ సర్కార్ ముందస్తు చర్యలు తీసుకోబోతోంది.
కరోనా వ్యాప్తి నిరోధానికి ఏపీ సర్కార్ ముందస్తు చర్యలు తీసుకోబోతోంది. తెలంగాణ మాదిరిగానే ఏపీలో కూడా థియేటర్లు, స్కూళ్లు మూసేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాసేపట్లో సీఎం క్యాంప్ కార్యాలయంలో కరోనాపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
కరోనా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. ఇప్పటికే రోజుకు మూడు సార్లు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తున్న సీఎం.. కాసేపట్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.