పోలవరంలో ఏరియల్‌ సర్వే చేయనున్నజగన్‌

Update: 2019-08-08 03:40 GMT

పోలవరం వరద ముంపు ప్రాంతాల్లో ఇవాళ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి అమరావతి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఏరియల్ సర్వేకు వెళ్లనున్నారు. కాపర్ డ్యామ్ కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలకు హెలికాప్టర్ ద్వారా ఆయన పరిశీలించనున్నారు. కాఫర్‌ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్‌ ద్వారా సీఎం పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. కాగా వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనను మరో రోజును పొడిగించుకున్నారు. దీంతో సీఎం అనంతపురం, కడప జిల్లాల పర్యటన వాయిదా పడింది. కియా మోటార్స్ ప్రారంభోత్సవానికి కూడా జగన్ హాజరుకాలేకపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ కార్యక్రమానికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హాజరుకానున్నారు.

Tags:    

Similar News